తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి ఇవాళ(మంగళవారం జులై22) సమావేశం అయింది. ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
పాలక మండలిలో తీసుకున్ననిర్ణయాలను మీడియాకు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణంపై చర్చించామని… కమిటీ నివేదిక మేరకు ఈ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
సామాన్య భక్తులకు అదనంగా వసతి సదుపాయం అధ్యయనంపై చర్చించారు. అలిపిరి వద్ద మౌలిక సదుపాయాలు కల్పనకు ఓ కమిటీని నియమించనున్నట్లు తెలిపారు.
శిలాతోరణం, చక్రతీర్ధం అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణానికి అధ్యాయానానికి కమిటీ వేయనుంది.
శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసే విధంగా కో ఆర్డినేటర్లు నియామకానికి ఆమోదం తెలిపింది. సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదించింది.
కల్యాణకట్టల వద్ద పారిశుధ్యం పెంపునకు, తిరుమలలో పరిపాలన భవనాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. పాత భవనాలు తొలగించి నూతన భవన నిర్మాణానికి ఆమోదించింది.
ఒంటిమిట్ట ఆలయంలో త్వరలోనే అన్నదానం ప్రారంభించనుంది. రూ. 4.7 కోట్లతో అన్నదానం కోసం నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.
320 ఆలయాలకు మైక్ సెట్లు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 700 మంది వేద పారాయణదారులు నియమాకానికి ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.18కోట్ల నిధులు కేటాయించనుంది.
600 మంది వేద పారాయణదారులకు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఆమోదించింది. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఏపీలోని పలు దేవాలయాల వద్ద భజన మండలాల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు.


పండగలకు ప్రత్యేక రైళ్లు అంటూ.. బాదేస్తున్నారా..