తెలంగాణ వడ్లు కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెరాస దీక్షకు పూనుకుంది.
అయితే ఢిల్లీలోని తెలంగాణ భవన్ పరిధిలో టీఆర్ఎస్ దీక్షకు వ్యతిరేకంగా బీజేపీ పోస్టర్లను పెట్టారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో కేసీఆర్కు వ్యతిరేకంగా భాజపా నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
‘తెలంగాణ రైతులను గాలికొదిలేసి దిల్లీలో డ్రామాలా’, ‘చేతనైతే ధాన్యం కొనుగోలు చేయి, లేకపోతే గద్దె దిగు’ నినాదాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

అయితే బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టీఆర్ఎస్ కార్యకర్తలు తొలగించారు. పోస్టర్లను చింపేశారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

