telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు..కేసీఆర్ పై సెటైర్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి ఈ మధ్య కాలంలో సీఎం కెసిఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన విమర్శల అస్త్రాలను కూడా పెంచుతూ…సీఎం కెసిఆర్ పై ఫైర్ అయ్యారు. తాజాగా మరోసారి సీఎం కెసిఆర్ పై విజయశాంతి మండిపడ్డారు. ” ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్ గారికి సరిగ్గా వర్తించే సమయం సమీపించింది. కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి… ఇంకొందరిని భయపెట్టి… ఒత్తిళ్ళతో ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చింది. మరికొంత ముందుగానే మాణిక్యం టాగోర్ గారు రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావచ్చు. ఇప్పుడిక కాలము, ప్రజలే నిర్ణయించాలి.” అని ఫైర్ అయ్యారు విజయశాంతి. కాగా…విజయశాంతి కాంగ్రెస్ పార్టీను వీడి బీజేపీలోకి చేరుతారని ఈ మధ్యలో జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. 

Related posts