రెండు టీ20 ల భారత్-ఆస్ట్రేలియా సిరీస్ లో నేడు ఆఖరి మ్యాచ్ జరుగుతుంది. మొదటి మ్యాచ్ లో పోరాడి ఓడినా, రెండో సారి గెలిచేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇప్పటివరకు సొంతగడ్డపై భారత్కు ఎదురులేదనుకున్నా, అనిశ్చితికి మారుపేరైన పొట్టి ఫార్మాట్లో టీమ్ఇండియాకు ఆస్ట్రేలియా నుంచి అనుకోని పరాజయం. గెలుపు అంచుల దాకా వెళ్లి ఆఖర్లో పోరాడి ఓడిన కోహ్లీసేన సిరీస్ సమం చేసేందుకు కంగారూలతో సమరానికి సిద్ధమైంది. ఆరునూరైనా బెంగళూరులో గెలిచి సిరీస్ కాపాడుకోవాలనే కసితో కనిపిస్తున్నది.
వైజాగ్ టీ20 ఓటమితో తేరుకున్న భారత్..గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. ఓవైపు ప్రపంచకప్ సన్నాహకాల్లో ప్రయోగాలు చేస్తూనే ప్రత్యర్థికి తలవంచుకుండా పోరాడేందుకు సమాయత్తమైంది. మరోవైపు సొంత ఇలాఖాలో తమకు ఎదురైన టెస్ట్, వన్డే సిరీస్ పరాజయాలకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఆసీస్ పట్టుదలతో కనిపిస్తున్నది. వైజాగ్ విజయమిచ్చిన జోష్తో కనిపిస్తున్న ఆసీస్..అదే జోరులో సిరీస్ను దక్కించుకోవాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. గెలిచి భారత్ సిరీస్ను సమం చేస్తుందా లేక ఓడి ప్రత్యర్థికి అవకాశమిస్తుందా అన్నది ఆసక్తిరేపుతున్నది. దీనితో నేటి మ్యాచ్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
నీ వక్షోజాలు ముట్టుకోవచ్చా అని అడిగాడు : షెర్లిన్ చోప్రా