మన దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 46,148 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,79,331 కి చేరింది. ఇందులో 2,93,09,607 మంది కోలుకొని డిశ్చార్జ్కాగా, 5,72,994 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 979 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,96,730 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 58,578 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
previous post
కంగనాపై శివసేన నేత తీవ్ర వ్యాఖ్యలు