మలయాళంలో విజయవంతమైన `లూసిఫర్`ను మెగాస్టార్ చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సుజీత్ కు మెగాస్టార్ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. ‘లూసిఫర్’ రీమేక్ రైట్స్ రామ్ చరణ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రం ఆచార్యను పూర్తి చేయడానికి ఎదురుచూస్తున్నారు. ఇది పూర్తి కాగానే మలయాళ చిత్రం లూసిఫర్ను చిరంజీవి రీమేక్ చేయాల్సి ఉంది. అయితే `లూసిఫర్` సినిమాలో ఓ ప్రముఖ పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారతో సంప్రదింపులు చేశారని, అందుకు ఆమె కూడా ఓకే చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇదే పాత్ర గురించి మరో వార్తలు హల్చల్ అవుతోంది. ఈ సినిమా నుంచి నయన్ తప్పుకున్నారంట. ఇప్పుడు చిరు సినిమా కోసం మరో స్టార్ హీరోయిన్ త్రిషతో చర్చలు జరిపారంట. ఆమె వెంటనే సినిమాకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అతి త్వరలో ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన వస్తుందని సినీ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది.
previous post
రియల్ లైఫ్ లో బిడియం కలిగిన అమ్మాయినే… : రాశిఖన్నా