యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని రొమాంటిక్ ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ భారీ చిత్రం షూటింగ్ అంతిమ దశలో ఉంది. ఇటీవలే ఇటలీలో షూటింగ్ కు గాను అక్కడకు వెళ్లి కీలక షెడ్యూల్ ను ప్లాన్ చేసారు. ఇక అక్కడ నుంచే చిత్ర యూనిట్ పలు ఆసక్తికర అప్డేట్స్ ను కూడా వదిలారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా.. 30 రోజుల లాంగ్ షెడ్యూల్లో పాల్గొన్న పూజ, తన షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో తన ఫీలింగ్ను పంచుకుంది. “రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీటెడ్.. ఇట్స్ టైమ్ టూ ఫ్లెట్” అంటూ రాసుకొచ్చిన పూజ… హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లిపోయింది. చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్లిన పూజ, తన స్నేహితులు, ఫ్యామిటీ మెంబర్స్తో కలిసి కేక్ కట్ చేసింది.
previous post