telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

గుడ్ న్యూస్… హోమ్ లోన్ పై రూ.2 లక్షల తగ్గింపు

Nirmalasitaraman

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ఇంటి కొనుగోలుదారులకు శుభవార్త అందించారు. హోమ్ లోన్‌పై మధ్యతరగతి ప్రజలు మళ్లీ సబ్సిడీ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. మోదీ సర్కార్ తాజాగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్‌ను (ఎంఐజీ 1, ఎంఐజీ 2) మరి కొంత కాలం పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. సాధారణంగా ఈ స్కీమ్ గడువు మార్చి 31తోనే ముగిసింది. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ కింద వార్షిక ఆదాయం ప్రాతిపదికన సబ్సిడీ లభిస్తుంది. రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్యలో ఆదాయం కలిగిన వారు ఎంఐజీ 1 కిందకు వస్తారు. అదే రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్యలో ఆదాయం ఉన్న వారు ఎంఐజీ 2 కేటగిరిలో ఉంటారు. ఎంఐజీ 1, ఎంఐజీ 2 కేటగిరిలలోని వారు గరిష్టంగా రూ.2.35 లక్షలు, రూ.2.30 లక్షల వరకు సబ్సిడీ పొందొచ్చు. అంటే మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద హోమ్ లోన్ తీసుకుంటే మీకు ఈ మొత్తం వడ్డీ రాయితీ కింద లభిస్తుంది. ఎంఐజీ 1 కేటగిరిలోని వారికి రూ.9 లక్షల వరకు రుణంపై 4 శాతం వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. ఎంఐజీ 2 కేటగిరిలోని వారికి రూ.12 లక్షల వరకు రుణంపై 3 శాతం వడ్డీ సబ్సిడీ వస్తుంది. అంటే ఇక్కడ రూ.9 లక్షలు, రూ.12 లక్షల వరకు మాత్రమే రుణం లభిస్తుందని కాదు. రుణ గ్రహీత అర్హత ప్రాతిపదికన ఎంతైనా రుణం పొందొచ్చు. అయితే వడ్డీ రాయితీ మాత్రం పైన పేర్కొన్న మొత్తానికి మాత్రమే వర్తిస్తుంది. దీంతో ఈఎంఐ భారం తగ్గుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఎంఐజీ 1 కేటగిరిలో ఉండి రూ.40 లక్షల వరకు రుణం తీసుకుంటే.. అప్పుడు రూ.12 లక్షల వరకు మొత్తంపై 3 శాతం వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. అంటే మిగతా రూ.28 లక్షలపై బ్యాంక్ వసూలు చేసే మామూలు వడ్డీనే పడుతుంది. ఇకపోతే ఈ తరహా రుణాలను బ్యాంకులు, హౌసింగ్ పైనాన్స్ కంపెనీలు కస్టమర్లకు అందిస్తున్నాయి.

Related posts