telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏఎంబీ సినిమాస్ మల్టిప్లెక్స్ లో .. మహేష్ మైనపు విగ్రహం..

mahesh wax statue in amb multiplex soon

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ విగ్రహానికి చోటు దక్కింది. ప్రస్తుతం సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ మైనపు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. త్వరలోనే ఈ విగ్రహం హైదరాబాద్ కు రానుంది.

మహేశ్ బాబు భాగస్వామిగా ఇటీవల ప్రారంభమైన ఏఎంబీ సినిమాస్ మల్టిప్లెక్స్ లో ఈ మైనపు విగ్రహాన్ని అభిమానుల కోసం ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ నెల చివరిలో మహేశ్ మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చి, ఆ తర్వాత లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రధాన కార్యాలయానికి తరలిస్తామని మ్యూజియం వర్గాలు తెలిపాయి. విగ్రహాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి.

Related posts