కరోనా సమయంలో వాట్సాప్ ద్వారా అనేక తప్పుడు వార్తలు షేర్ అవుతున్న నేపథ్యంలో ప్రముఖ సోషల్మీడియా మేస్సేజింగ్ యాప్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లు తమ స్టేటస్లో పెట్టుకొనే వీడియోలు 15 సెకండ్లకు మించి నిడివి లేకుండా సెట్టింగ్స్ చేసింది. తాజాగా మళ్ళీ స్టేటస్ వీడియో నిడివిని 30 సెకండ్లుగా ఫిక్స్ చేసింది. దీంతో యూజర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ మొదలైనప్పడు స్టేటస్ వీడియోల నిడివి 90 సెకండ్లు ఉండేది. యూజర్లు పెరుగుతున్నాకొద్ది నిడివిని తగ్గిస్తూ వస్తున్నది. భారత్లో వాట్సాప్ యూజర్లు 40కోట్ల మంది ఉన్నారు.