అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేసిన “భారత్” సినిమా రంజాన్ కానుకగా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సల్మాన్ హీరోగా నటించగా, కత్రినా, దిశా పటానీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిశా, సల్మాన్ వయసుపై కామెంట్స్ చేసింది. భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేయకపోవచ్చని, వయసు రీత్యా ఆయన తనకంటే ఎంతో పెద్దవాడని, ఈ సినిమాలో సల్మాన్ కి పాతికేళ్ల వయసు ఉన్న సమయంలో ఆయన సరసన కనిపిస్తానని, అలా అన్ని సినిమాలకు కుదరదు కాబట్టి ఆయనతో కలిసి పని చేయకపోవచ్చని తెలిపింది. ఈ కామెంట్స్ విన్న సల్మాన్ స్పందిస్తూ “భవిష్యత్తులో దిశా నాతో కలిసి పనిచేయదా…? ఎందుకలా..? వయసు గురించి ఆమె అలా ఎలా మాట్లాడుతోంది..? నేనేమైనా మైనర్ తో కలిసి సినిమాలు చేస్తున్నానా..?” అంటూ ఫైర్ అయ్యారు.
previous post
next post


“సైరా”పై పూరీ కామెంట్స్… అన్నయ్యను కొట్టేటోడు మళ్లీ పుట్టడు…