telugu navyamedia
సినిమా వార్తలు

విమర్శకులపై “అర్జున్ రెడ్డి” దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

Sandeep-Reddy-VAnga

తెలుగులో సంచలన విజయం సాధించిన “అర్జున్‌ రెడ్డి” రీమేక్‌ “కబీర్ సింగ్”తో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు సందీప్. షాహిద్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన “కబీర్‌ సింగ్” బాలీవుడ్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమాపై బాలీవుడ్ సినీ విమర్శకులు మాత్రం పెదవి విరిచారు. ముఖ్యంగా సినిమాలో మహిళలను తక్కువగా చూపించారని, హీరో పాత్రను ఎలాంటి గమ్యం లేకుండా కేవలం ఓ తాగుబోతుగా, తన మీద కంట్రోల్‌ లేని వ్యక్తిగా చూపించారని విమర్శించారు. ఇటీవల సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో క్రిటిక్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాను విమర్శించే వారంతా సూడో స్త్రీవాదులంటూ విమర్శించాడు. ఒక సినిమాను విమర్శించడానికి, అభ్యంతరం చెప్పడానికి చాలా తేడా ఉంటుందని, తన తాజా చిత్రం కబీర్ సింగ్ కు కొందరు రెండు స్టార్స్ మాత్రమే ఇచ్చారని, కానీ తెలివైన మాత్రం రూ.200 కోట్లు కట్టబెట్టారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు మీ క‌న్నా మా తెలుగువాళ్లే మంచోళ్లు. అక్క‌డా సినిమాకు మంచి రేటింగ్స్ రాక‌పోయినా క‌నీసం టెక్నిక‌ల్ అంశాల గురించి ఎనాల‌సిస్ చేసి బాగా రాసారు. క‌బీర్ సింగ్ విషయంలో అదీ జ‌ర‌గ‌లేదు. సినిమాకు సంబంధించి అ,ఆలు కూడా తెలియని వాళ్లు క్రిటిక్స్ అవతారం ఎత్తడం ప్రమాదకరమని వ్యాఖ్యానించాడు. దర్శకుడు సం‍దీప్‌ రెడ్డి వంగా ఇంటర్య్వూపై సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్పందిస్తూ “సందీప్‌ రెడ్డి వంగా అమాకత్వంతో కూడిన నిజాయితీ, నిజమైన ధైర్యం కలిగిన వ్యక్తి. కబీర్‌ సింగ్‌పై ఆయన తాజా ఇంటర్వ్యూ ఓ సంచలనం” అంటూ ట్వీట్ చేశారు.

Related posts