telugu navyamedia
సినిమా వార్తలు

మే 8 అక్కినేని జీవితంలో మర్చిపోలేని రోజు

May 8 is an unforgettable day in the life of Akkineni
అదృష్టవంతుడిని ఎవరు చెడగొట్టలేరు . దురదృష్టవంతుడిని ఎవరు బాగుచెయ్యలేరు అనే మాటలు అక్కినేని విషయంలో అక్షర సత్యం . అక్కినేని నాగేశ్వర రావు ఓ పేదింటి పిల్లవాడు . చదువుకోవాలనే ఆశవున్నా , ఆర్ధిక స్థోమత లేక ఇంటి పనులు చేసుకుంటూ నాటకాల్లో నటిస్తూ ఉండేవాడు . జీవితంలో తను తెలుగు సినిమా రంగాన్ని శ్వాసించి శాసించే స్థాయికి వస్తానని కలగనలేదు . అనుకోని ఘటన అక్కినేని జీవితాన్ని మలుపు తిప్పింది . గ్లామర్ ప్రపంచంలో తిరుగులేని కథానాయకుడయ్యారు . 
May 8 is an unforgettable day in the life of Akkineni
అక్కినేని నాగేశ్వర రావు 1924 సెప్టెంబర్ 20 వ తేదీన గుడివాడ తాలూకా వెంకటాపురం అనే గ్రామంలో  అక్కినేని వెంకటరత్నం పున్నమ్మ దంపతులకు 9వ సంతానంగా జన్మించాడు . అంతకు ముందు పున్నమ్మకు నలుగురు పుట్టి చనిపోయారు . 
అదేరోజు ఆమెకు ఓ కల వచ్చింది . చిన్న బాబు చుట్టూ ఓ పాము మూడు సార్లు తిరిగిందట . ఆమె భయపడి నాగేశ్వర రావు అనే పేరు పెట్టుకుంటాను అని మొక్కుకొని వెంటనే బాబుకు ఆ పేరు పెట్టుకుందట వెంకటరత్నం అక్కినేనికి ఐదు సంవత్సరాల వయసు వున్నప్పుడే చనిపోయారు . 
May 8 is an unforgettable day in the life of Akkineni
పున్నమ్మకు ఐదుగురు మగపిల్లలు. అందరు వేరు . పడ్డారు . అయినా పున్నమ్మ, నాగేశ్వర రావు మంచి చెడ్డలు పెద్దన్నయ్య 
రామ బ్రహ్మం చూసేవాడు . నాగేశ్వర రావు చిన్నప్పటి నుంచి నాటకాలు ఆడుతూ వుండే వాడు . మొదట సరదాగా నారద పాత్రలో నటించాడు . ఊరువారంతా మెచ్చుకున్నారు . ఆతరువాత హరిశ్చంద్ర నాటకంలో చంద్ర మతి పాత్ర పోషించాడు . అచ్చు ఆడపిల్లలాగే వున్నాడు . తల్లి పున్నమ్మకు ఆడపిల్లలు లేరు ; అందుకే అక్కినేనిని ఆడపిల్లలాగే అలంకరించి మురిసిపోతూ ఉండేది . 
అలా ఒకసారి తెనాలిలో నాటకం వేసి విజయవాడ రైల్వే స్టేషన్లో అక్కినేని తన సహా నటులతో దిగాడు అప్పుడు అక్కడేవున్న నీరంతా ,దర్శకుడు ఘంటసాల బలరామయ్య అక్కినేని చూశాడు .   ముద్దుగా వున్నా అక్కినేనిని  తన సీతారామ జననం సినిమాలో హీరోగా తీసుకున్నాడు. ఆ సినిమా కోసం అక్కినేని దుక్కిపాటి మధుసూదన రావు గారితో కలసి మద్రాస్ వెళ్ళాడు . అలా మద్రాసులో 1944 మే 8న మొదటిసారి కాలు పెట్టాడు . 
May 8 is an unforgettable day in the life of Akkineni
అందుకే అక్కిని చనిపోయేంత వరకు మే 8 తేదికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాడు . మహా నటుడు అక్కినేని అమృత ఘడియల్లో మద్రాసులో కాలు పెట్టాడు కాబట్టే సినిమాలో చిరస్మరణీయంగా మిగిలిపోయాడు . ప్రేక్షకుల్లా మనస్సులో స్మృతి చిత్రంలా ఉండిపోయారు . 
-భగీరథ 

Related posts