క్షేత్రస్థాయిలో పరిస్థితులపై మంత్రులతో లోకేష్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సమస్యపై మంత్రి గొట్టిపాటితో నారా లోకేష్ మాట్లాడారు.
సాయంత్రం 4 గంటలకల్లా వందశాతం విద్యుత్ పునరుద్ధరిస్తామన్న గొట్టిపాటి తెలిపారు. కొన్ని చోట్ల ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ నిలిపివేసినట్లు గొట్టిపాటి వెల్లడించారు.
సీఎండీలు కూడా క్షేత్రస్థాయిలో ఇదే పనిలో నిమగ్నమైనట్లు మంత్రి గొట్టిపాటి రవి వివరించారు.
విద్యుత్ పునరుద్ధరణ చర్యలపై ప్రజలకు సమాచారం ఇవ్వాలని లోకేష్ సూచించారు.

