టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి విషయంలో జరగుతున్న ఆందోళనలన్నీ ఆయన ప్రేరేపితాలేనని అన్నారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణలపై సలహాలు ఇవ్వాల్సిన చంద్రబాబు విద్యార్థులను, రైతులను రెచ్చగొడుతున్నారని మంత్రి మండిపడ్డారు. అక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఆయన చేయిస్తున్నవేనని ఆరోపించారు. రాజధాని గురించి మాట్లాడే అర్హత, హక్కు చంద్రబాబుకు లేవన్నారు.
నేత నారా లోకేశ్పై కూడా పలు విమర్శలు చేశారు. లోకేశ్కు పరామర్శ అని కూడా పలకడం రాదని అన్నారు. అందుకు బదులు పరవశించానని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పరామర్శ అనే పదాన్ని సరిగా పలకలేని లోకేశ్ కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.
అమిత్ షా టీడీపీకి తలుపులు మూసేశారు: కన్నా