రాష్ట్రం నుంచి ఇటీవల వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఆయనను వెంట తీసుకుని నేను, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ని మర్యాదపూర్వకంగా కలిశాం అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేసారు.
ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డిని శ్రీ ఖర్గే అభినందించారు. ఈ భేటీలో ఎంపీలు శ్రీ మల్లు రవి, శ్రీ సురేష్ షెట్కర్, శ్రీ బలరాం నాయక్ పాల్గొన్నారు.

