ప్రముఖ కన్నడ, తెలుగు నటి పవిత్రా జయరామ్ కారు ప్రమాదంలో మరణించారు. హైదరాబాద్ మెహబూబ్ నగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ సమాచారం అభిమానులను మరియు టీవీ పరిశ్రమను పెద్ద షాక్కు గురి చేసింది. ఆమె కారు బస్సును ఢీకొట్టింది, ఆ తర్వాత టీవీ నటి అక్కడికక్కడే మరణించింది.
అయితే ఈ సంఘటన మరవకముందే.. మరో విషాదం ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురిచేసింది. పవిత్ర మరణాన్ని తట్టుకోలేక నటుడు చంద్రకాంత్ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ న్యూస్ విన్న బుల్లితెర ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఈ నేపథ్యంలో పవిత్ర, చంద్రకాంత్ ల లవ్ స్టోరీ ఏంటి? తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత, వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమలో ఎవ్వరికీ తెలియని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది పవిత్ర మరియు చంద్రకాంత్ భార్యాభర్తలని నమ్ముతారు, కానీ వీరు భార్యాభర్తలు కాదు. వీరి ప్రేమకథ త్రినయని సీరియల్ సమయంలోనే మొదలైంది.
పవిత్ర గతంలో వేరొకరితో వివాహం జరిగింది, కానీ కొన్ని కారణాల వల్ల ఆమె తన భర్త నుండి విడిపోయి ఇప్పుడు ఒంటరిగా ఉంది. ఆమెకు ఇద్దరు సంతానం.
ఇక చంద్రకాంత్ కు సైతం పెళ్లైంది. అతడు కూడా తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. తమ జీవితాల్లో ఉన్న విషాద సంఘటనలను మరచిపోయి ఇద్దరు కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నారు.
త్రినయని సీరియల్ లో ఇద్దరికి కలిసి నటించే అవకాశం వచ్చింది. ఆ సీరియల్ జరుగుతున్న సమయంలోనే ఇద్దరికి పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని భావించారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి వీరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది.
త్వరలోనే ఇద్దరూ ఒక్కటౌవ్వాలని అనుకున్నారు. తద్వారా తమ రిలేషన్ గురించి అందరికి తెలియజేయాలనుకున్నారు. తమ జంట గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకున్నా తమ ప్రేమ పవిత్రమైనదని పెళ్లి ద్వారా ఈ ప్రపంచానికి తెలియజెప్పాలని చూశారు.
కానీ ఇంతలోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది. కారు ప్రమాదంలో పవిత్ర మరణించడం, ఆమె మరణాన్ని తట్టుకోలేక చంద్రకాంత్ సైతం ఆత్మహత్య చేసుకోడంతో వారి ప్రేమ విషాదంగా మారింది.

