సోషల్ మీడియా వాడకం పెరిగిన తరువాత సెలెబ్రెటీలకు, అభిమానులకు మధ్య దూరం చాలావరకు తగ్గిందనే చెప్పొచ్చు. కానీ దీనివల్ల సెలెబ్రెటీలకు ఇబ్బందులు కూడా పెరిగిపోయాయి. అందుకే చాలా విషయాలలో ఎంతో ఓపికతో ఉండే సెలబ్రిటీలు ఒక్కోసారి నెటిజన్స్ చేసే ట్రోల్స్కి ఆగ్రహంతో ఊగిపోతుంటారు. తాజాగా రష్మిక తన ఇన్స్టాగ్రామ్ ద్వారా నెటిజన్కి చురకలు అంటించింది. రష్మిక చిన్ననాటి ఫోటోలని జత చేస్తూ.. ఎవరైన ఊహించారా? ఈ చిన్నపిల్ల ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో.. అంటూ పలు అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. దీంతో రష్మిక ఈ విధంగా తన కోపాన్ని వ్యక్త పరచింది. “నటీనటుల మీద ట్రోల్స్ చేస్తే మీకు ఏమోస్తుందో మాకు అర్ధం కావడం లేదు. సెలబ్రిటీల అయినంత మాత్రాన మమ్నల్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం కరెక్టా? మేము ఏం అనం అనే కదా మీ ధైర్యం. వర్క్ విషయంలో మమ్మల్ని కామెంట్స్ చేయోచ్చు, తప్పులేదు. కాని పర్సనల్ విషయాలపై మాట్లాడే రైట్ మీకు ఎవరు ఇచ్చారు. చాలా మంది ఇలాంటి కామెంట్స్ పట్టించుకోవద్దు అని చెబుతుంటారు. కాని ఇలాంటి చెత్త విమర్శలకి సమాధానం ఇవ్వకుండా ఎలా ఉంటాం. నటులు అవ్వడం అంటే అంత ఈజీ కాదు. ప్రతిఇ వృత్తిని అందరూ గౌరవించాలి. కానీ అన్నింటికంటే ముందు ఒకరినొకరు గౌరవించడం మొదలుపెట్టాలి. ఈ పోస్ట్ ఎవరు పెట్టారో వాళ్లకు కంగ్రాట్స్. మీరు నన్ను నొప్పించాలనుకున్నారు. సక్సెస్ అయ్యారు” అని రష్మికా మందన్నా పేర్కొన్నారు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు , భీష్మ చిత్రాలలో నటిస్తుంది రష్మిక.
previous post
బిగ్బాస్ షో..ఓ బూతు ప్రోగ్రాం..