telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

విదేశాలకు వెళ్లిన నితిన్ ‘రంగ్ దే’ టీమ్…

Rangde

ఈ లాక్ డౌన్ లో ఓ ఇంటివాడైన హీరో నితిన్ వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే ‘రంగ్ దే’ సినిమా ను పట్టాలెక్కించాడు. ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘రంగ్ దే’ ఫస్ట్ లుక్ మరియు నితిన్ మ్యారేజ్ నాడు రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోకి మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయాలనీ నిర్మాతలు భావిస్తున్నారని గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.అయితే ఇప్పుడు థియేటర్స్ కు అనుమతి లభించడంతో రంగ్ దే సినిమాను కూడా థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

ఇక కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్ బ్యాలెన్స్ ‘రంగ్ దే’ ఇటీవలే హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైంది. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ `రాధేశ్యామ్` కోసం ఇప్పటికే ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రభాస్ బాటలోనే యంగ్ హీరో నితిన్ కూడా ఇటలీ పయనమవుతున్నాడట. హైదరాబాద్ లోషూట్ పూర్తయిన తరువాత రంగ్ దే మూవీ టీమ్ ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేసారని తెలుస్తోంది. ఇందుకోసం చిత్రయూనిట్ ఇటలీకి వెళ్లనుందని సమాచారం. ఇటలీ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలు కూడా చిత్రీకరించనున్నారు. ఆ రెండు పాటలతో షూటింగ్ పూర్తి కాబోతున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు చూస్తున్నారు.

Related posts