స్వాతంత్య్ర పోరాటయోధుడు, నవ భారత నిర్మాత, దేశ తొలి ప్రధానమంత్రి, భారతరత్న జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ప్రజాస్వామిక, ప్రగతిశీల భారతావనికి పునాది వేసిన మహనీయుడు స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారని స్మరించుకున్నారు.

