తెలంగాణలో అన్నిరకాల ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించారు. కరోనా నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి బుధవారం వెల్లడించారు.
మరోవైపు, మే 4 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న ఎంసెట్- 2020, మే 2న నిర్వహించనున్న ఈసెట్ను- 2020ని వాయిదా వేసే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కరోనా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఒకవేళ లాక్ డౌన్ పొడగిస్తే పరీక్షల తేదీలు మారే అవకాశముంది.
చంద్రబాబు పాలనలో విజయనగరానికి చేసిందేమీ లేదు: విజయసాయి