telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

బోయిన్‌పల్లిలో విషాదం.. టిప్పర్ ఢీకొని చిన్నారి మృతి

హైదరాబాద్ జిల్లాలోని బోయిన్‌పల్లి హస్మత్‌పేట్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. టిప్పర్ ఢీకొని చిన్నారి మృతి చెందింది. టిప్పర్ బ్రేక్‌లు ఫేల్ కావడంతో అది వెనక్కి దూసుకువచ్చి అక్కడే ఆడుకుంటున్న ఆరు సంవత్సరాల చిన్నారి పై నుంచి దూసుకెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.

చిన్నారి పైనుంచి వెళ్లిన టిప్పర్ వెనకాల ఉన్న టాటా ఎస్ వాహనంను ఢీకొని, విద్యుత్ స్థంభాన్ని ఢీకొని ఆగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts