వైసీపీ ప్రభుత్వ తొమ్మిది నెలల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 180 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ ఆరోపించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకు చెల్లెలు వరుస అయ్యే వైఎస్ వివేకా కూతురు సునీతకే న్యాయం చేయని జగన్, ఇంకా, మహిళలకు ఏం న్యాయం చేస్తారు? అని ప్రశ్నించారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నిరసనలు వ్యక్తం చేసిన రాజధాని ప్రాంత మహిళలపై 2800 కేసులు బనాయియించారని విమర్శించారు. దిశ పోలీస్ స్టేషన్ లో పని చేసే ఓ హోంగార్డు ఓ యువతిపై అత్యాచారం చేస్తే విచారణ జరపలేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తన కుటుంబంపై అక్రమ కేసులు పెట్టే యత్నం చేశారని ఆరోపించారు.