మొత్తానికి కేబినెట్ విస్తరణకు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగం సిద్ధం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల తర్వాత ఇప్పటికి విస్తరణ జరుగుతుండటం విశేషాన్ని సంతరించుకోగా, అందులో ఎవరికి స్తానం దక్కుతుందనేది మరో ముఖ్య అంశంగా ఉంది. రేపు(మంగళవారం) ఈ విస్తరణకు సీఎం ముహూర్తం ఫిక్స్ చేసినప్పటి నుంచి ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈసారి కేబినెట్లో టీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్, ఈటలకు చోటు దక్కకపోవచ్చనే ప్రచారం ఉండనే ఉంది.
ఆశావాహులలో వీరిపేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి.. ఇంద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి, జగదీష్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్లకు కేబినెట్ బెర్త్ ఖాయమని తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్గా పద్మారావు, చీఫ్ విప్గా దాస్యం వినయ్ భాస్కర్ను నియమించే అవకాశం ఉంది. త్వరలోనే లోక్సభ ఎన్నికలు జరగనుండడంతో అవి ముగిశాక కేబినెట్ విస్తరణ ఉంటుందని సమాచారం. అలాగే, ఎస్టీ కోటా నుంచి ఒకరికి, ఓ మహిళకు ఈసారి చాన్స్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ట్రిపుల్ తలాక్ బిల్లుద్వారా మహిళలకు అన్యాయం: ఒవైసీ