నందమూరి బాలయ్య మరో సారి గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా లాక్డౌన్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం ఇచ్చిన బాలయ్య, సినీ కార్మికులను ఆదుకునేందుకు కూడా విరాళం ప్రకటించారు. ఆ తర్వాత తన నియోజకవర్గంలో కోవిడ్ హాస్పిటల్కు కూడా భారీ విరాళం అందజేశారు. ఇప్పుడు బసవతారకం ఆసుపత్రిలో రొమ్ము క్యాన్సర్ తో వచ్చిన యువతికి ఉచితంగా ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతం అవ్వడంతో యువతిని బసవతారకం హాస్పిటల్ చైర్మన్ బాలకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ వైద్యో నారాయణో అన్న మాటను మా వైద్యులు నిజం చేశారని అన్నారు. కాళహస్తి చెందిన ఓ యువతి రొమ్ముకు కుడివైపున భారీ కణితితో బసవతారకంకు వచ్చిందని, అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉంది.. వెంటనే ఆపరేషన్ చేయాలని మా డాక్టర్లు చెప్పారని అన్నారు. ఆలస్యం అయ్యే కొద్దీ ఆ యువతి ఆరోగ్యం క్షిణిస్తుంది అని మా డాక్టర్లు చెప్పారన్న ఆయన ఆ విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే ఆపరేషన్ నిర్వహించాలని చెప్పానని తెలిపారు.
రాహుల్ గాంధీ పై అమెరికా మాజీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు…