విశ్వనగరి.. సమృద్ధి జలసిరి..!
గత 9 ఏళ్లలో జలమండలి సాధించిన ప్రగతి దశాబ్ది ఉత్సవాల్లో మంచినీళ్ల పండగ సందర్భంగా ప్రత్యేక కథనం నీరే సమస్త జీవకోటికి జీవనాధారం. ఆహారం లేకుండా కొన్ని రోజులు బతగలం కానీ నీరు లేకుండా జీవించడం అసాధ్యం. కోటికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి సరఫరాతో పాటు మురుగు నీటి నిర్వహణ జలమండలి నిర్వర్తిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం నుంచి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నగర వాసుల దాహార్తిని తీరుస్తోంది. దీనికోసం హైదరాబాద్ నలుమూలలా తాగునీటి రిజర్వాయర్లతో పాటు మంచినీటి శుద్ధి కేంద్రాలను నిర్మించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ మాత్రమే కాకుండా ఔటర్ రింగు రోడ్డు పరిధి వరకు తాగునీరు సరఫరా చేస్తుంది. రాబోయే 50 ఏళ్ల వరకు తాగునీటి సరఫరాకు భరోసా కల్పిస్తూ.. 100శాతం మురుగు శుద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పాలనలో నిర్లక్ష్యానికి గురై పూర్తిగా అస్థిత్వం కూడా పోగొట్టుకుని నిర్వహణ భారంతో అప్పులు ఒకవైపు, నెలనెలా తడిసి మోపెడైన కరెంటు బిల్లులతో సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్థితి మరోవైపు.. వెరసి బోర్డు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ప్రభుత్వానికి పరిస్థితిని ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. చలించిన దాఖలాలు లేవు. ఇది తెలంగాణ ఏర్పాటు కాక ముందు పరిస్థితి. కానీ.. 2014లో తెలంగాణ ఏర్పాటు కావడం, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర రావు

