*తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో రాఖీ వేడుకలు
*జగన్ కు రాఖీ కట్టి మహిళా నేతలు..
తాడేపల్లి ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళా మంత్రులు రాఖీలు కట్టారు. మంత్రులు తానేటి వనిత, విడదల రజని, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టిన వారిలో ఉన్నారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ నివాసంలో సీఎం వైఎస్ జగన్కు ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్ పద్మజ, మానస రాఖీలు కట్టారు.