రాష్ట్ర అభివృద్ధిని టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఈ రోజు ఉదయం ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ అమరావతి పేరుతో ఆటంకాలను సృష్టించేందుకు యత్నిస్తున్నారని అన్నారు.
అమరావతిపై అంత చిత్తశుద్ధి ఉంటే… సీఎంగా ఉన్నప్పుడు దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా మూడు రాజధానులు ఏర్పాటవుతాయని చెప్పారు. శాసనమండలి రద్దు అవుతుందని రోజా స్పష్టం చేశారు.