telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మునిగిపోయే పార్టీ అని అందరికీ అర్థమైంది: విజయ సాయిరెడ్డి

Vijayasai reddy ycp

టీడీపీ, జనసేనలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో మరోసారి విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై విమర్శలు గుప్పించారు. ‘గన్నవరం ఎమ్మెల్యే వంశీ వదిలిన సవాళ్లకు తెలుగుదేశం పార్టీ జవాబిచ్చే పరిస్థితిలో ఉందా? మాలోకం ఏదో అన్నాడు కాని ఎవరూ పట్టించుకోలేదు. మునిగిపోయే పార్టీ అని అందరికీ అర్థమైంది. చివరకు తండ్రీ కొడుకు, తోక పార్టీ దత్తపుత్రుడు మాత్రమే మిగులుతారు.

ఎల్లో మీడియా కూడా షాక్ నుంచి తేరుకోనట్టుంది. ‘బంగారు బాతు’ అమరావతిని చంపేశారని చంద్రబాబు శోకాలు పెడుతున్నదెందుకో ఇప్పుడు అర్థమైంది. అమరావతిలో తాత్కాలిక భవనాల కాంట్రాక్టు పొందిన సంస్థ రూ.500 కోట్లు ముట్ట చెప్పిందని ఇన్‌కంటాక్స్ వాళ్లు బయట పెట్టిన తర్వాత లింకులు బయటకొస్తున్నాయని ఆరోపించారు.

Related posts