telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండి రుహుల్లా..

*వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రహుల్లాకు అవకాశం
*రహుల్లాకు బీఫామ్ అందజేసిన సీఎం వైఎస్ జగన్
*కరీమున్నీసా స్థానంలో ఆమె కుమారుడికి అవకాశం

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండి రుహుల్లాను ముఖ్యమంత్రి జగన్ ఎంపిక చేశారు.. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా బీంఫాం అందుకున్నారు. ఇటీవల మరణించిన కరీమున్నీసా స్థానంలో ఆమె కుమారుడికి అవకాశం కల్పించారు.

ఈ నెల 24వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇటీవల మరణించిన కరీమున్నీసా స్థానంలో ఆమె కుమారుడికి అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, రుహుల్లా తండ్రి మహ్మద్‌ సలీమ్‌ పాల్గొన్నారు.

CM YS Jagan Handovers B Form To MLC Candidate Ruhullah - Sakshi

జగన్ కు కృతజ్ఞతలు….

ఈ సందర్భంగా రుహుల్లా ముఖ్యమంత్రి జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మూడు నెలల క్రితం అమ్మ కరీమున్నీసా మరణించారని.. సీఎం వైఎస్ జగన్‌ పిలిపించి ఈ రోజు బీఫామ్ ఇచ్చారని తెలిపారు. మైనారిటీలంతా సీఎం జగన్‌కి రుణపడి ఉంటారన్నారు.

మేమంతా ఆయనకు అండగా ఉండి ఆయన అడుగుజాడల్లో నడుస్తామన్నారు. తన తల్లి చేసిన అభివృద్ధిని కొనసాగిస్తానని రుహుల్లా అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, రుహుల్లా తండ్రి మహ్మద్‌ సలీమ్‌ పాల్గొన్నారు 

Related posts