telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మీడియా ముందుకు ఎమ్మెల్యే ఆర్కే: టీడీపీపై ఆగ్రహం

YCP MLA RK comments Minister Lokesh

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే (ఆళ్ల రామకృష్ణారెడ్డి) ఎక్కడకు వెళ్లారంటూ విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అమరావతిపై రైతులు ఆందోళనలు కొనసాగిస్తుంటే ఆర్కే కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు ఆర్కే వచ్చారు. సొంత పనులపై నాలుగు రోజులు హైదరాబాదుకు వెళ్లానని, దీనిపై ఇంత రాద్ధాంతం చేస్తారా? అని ఆయన టీడీపీపై మండిపడ్డారు.

40 ఏళ్లుగా చంద్రబాబు కనిపించడం లేదని కుప్పం ప్రజలు అంటున్నారు. దీనికి టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని అన్నారు.  శాసనసభలో రాజధాని అంశంపై సీఎం జగన్ ప్రకటన చేశారని అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు తాను ఇక్కడే ఉన్నానని ఆర్కే చెప్పారు. చాలా కాలం తర్వాత తమ కుటుంబంలో ఒక వివాహం జరగనుందని, ఆ పనులపైనే తాను హైదరాబాదుకు వెళ్లానని తెలిపారు. రైతు సంక్షేమం కోసం పాటుపడే పార్టీ వైసీపీ అని పేర్కొన్నారు.

Related posts