లింగమనేని గెస్ట్ హౌస్ కు ఒక్క అనుమతి కూడా లేదని ఈ విషయంలో లింగమనేని లేదా చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధం అని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. కృష్ణా నది కరకట్ట వెంబడి ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ కు ఒక్క అనుమతి కూడా లేదని ఆర్కే స్పష్టం చేశారు.
బహిరంగ చర్చ ఎక్కడ ఏర్పాటు చేసినా తాను వస్తానని అన్నారు. రేపు ఉదయం 11 గంటలకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో దీనిపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మీడియా ముందు ఆధారాలతో వాస్తవాలు వెల్లడిస్తానని ఆయన చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను మోసం చేస్తున్నాయి: మంత్రి ప్రశాంత్ రెడ్డి