ఏపీలోని ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు చెందిన వైకాపా కార్యకర్త సుబ్బారావు గుప్తా.. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. . కొందరు నేతల వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని మాట్లాడారు..
దీంతో కొందరు వైఎస్సార్సీపీ నేతలు సుబ్బారావుపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కొందరు వైఎస్సార్సీపీ నేతలు అర్ధరాత్రి సుబ్బారావు ఇంటికి వెళ్లి దాడికి ప్రయత్నించారు. ఆయన ఇంటి దగ్గర ఉన్న బైక్ను ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సుబ్బారావు పారిపోయారు.
ప్రాణ భయంతో సుబ్బారావు ఓ లాడ్జ్లో తలదాచుకోగా.. ఆయన ఆచూకీ కనిపెట్టి సుభానీ అనే వైసీపీ నేత దుర్భాషలాడుతూ, కొడుతూ, బెదిరించి దాడి చేశారు. పార్టీకి నష్టం కలుగుతుందనే అలా మాట్లాడానని అన్నారు.
‘తప్పయిపోయిందన్నా.., నేను చెప్పేది ఒకసారి విను. నాకు షుగర్ ఉంది. ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. నేను మీ మనిషిని’ అంటూ గుప్తా ప్రాధేయపడినా వదలకుండా మోకాళ్లపై కూర్చొబెట్టి బాలినేనికి క్షమాపణలు చెప్పించారు. కాగా.. సుబ్బారావుపై దాడి చేసిన సుభాని అనే వ్యక్తి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా చెబుతున్నారు.
వంద రోజుల పాలనలో ఏ ఒక్కపనీ చేపట్టలేదు: చంద్రబాబు