*ఏలూరు జి. కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ నరికి చంపిన దుండగులు
*బాధితుడి కుటుంబానికి పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యే తలారిపై స్థానికులు దాడి
*ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు గాయాలు..
ఏలూరు జిల్లాలోని వైఎస్ఆర్సీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు. గంజి ప్రసాద్ను కొందరు దుండగులు కత్తులతో నరికి చంపారు. దాంతో ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకొంది.
వైసీపీలోని మరో వర్గానికి చెందిన వారు హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే ఆ కుటుంబానికి పరామర్శించేందుకు వచ్చిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై స్థానికులు దాడి చేశారు. అయితే దాడిలో ఎమ్మెల్యే తలారి కి గాయాలయినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఎమ్మెల్యేను రక్షించేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. దీంతో వలయంగా ఏర్పడి.. ఎమ్మెల్యేను అక్కడి నుంచి ఎమ్మెల్యేని ఓ స్కూల్ దగ్గర ఉంచారు.