మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయనకు కుటుంబసభ్యులు ఈ రోజు నివాళులు అర్పించారు. ఏపీ సీఎం జగన్తో పాటు విజయమ్మ, భారతి, షర్మిల, అనిల్ కుమార్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో వైఎస్సార్‘ పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ… ’33 ఏళ్లు ఆయనతో కలిసి జీవించిన సమయంలో నేను ఆయనలో చూసిన మంచితనం, ఆయన చెప్పిన మాటల ఆధారంగా ఈ పుస్తకం రాశాను. ఆయనలో మూర్తీభవించిన మానవత్వం గురించి, ఆయన మాటకు ఇచ్చే విలువ గురించి రాయాలనిపించిందని తెలిపారు. ఎంతో మంది జీవితాలకు ఆయన వెలుగునిచ్చారుని చెప్పారు.ఆయన ప్రత్యర్థులు కూడా ఆయన జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటున్నారని ఆమె తెలిపారు.
చంద్రబాబు పాలనలో విజయనగరానికి చేసిందేమీ లేదు: విజయసాయి