telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముగిసిన సీఎం జ‌గ‌న్ భేటి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. 10 నిమిషాలపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

రాష్ట్రానికి రావాల్సిన రూ.17వేల కోట్లు విడుదల చేయాలని సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. నిధుల సమీకరణకు ఆటంకాలు లేకుండా బ్యాంకర్లకు ఆదేశాలివ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు బకాయిలు విడుదల చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్‌.. తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. రేపు(శుక్రవారం) ఉదయం 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ కానున్నారు.

Related posts