telugu navyamedia
రాజకీయ

మెగాస్టార్ చిరంజీవికి సీఎం జగన్ పిలుపు..!

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో మెగ‌స్టార్ చిరంజీవి త్వ‌ర‌లో భేటీ కానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో చిరంజీవికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.

క‌రోనా వేవ్ తగ్గుముఖం ప‌ట్ట‌డంతో థియేట‌ర్లు తెరిచేందుకు ఎగ్జిబిట‌ర్లు సిద్ధ‌మైనా ఏపీలో టిక్కెట్టు ధ‌ర స‌మ‌స్యాత్మ‌కంగా మారింది. స‌వ‌రించిన ధ‌ర‌ల‌తో ఎగ్జిబిష‌న్, పంపిణీ రంగాలు చిక్కుల్లో ప‌డ్డాయి. థియేట‌ర్ల స‌మ‌స్య చాలాకాలంగా ఓ కొలిక్కి రాలేదు. సీఎం జ‌గ‌న్ తో భేటీ కోసం సినీపెద్ద‌లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఏపీ మంత్రి పేర్ని నాని నేరుగా మెగాస్టార్ చిరంజీవికి శనివారం రోజు ఫోన్ చేసి , సినీపెద్ద‌ల‌తో క‌లిసి వ‌చ్చి ప్రస్తుత స‌మ‌స్య వివరించాల్సిందిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి తరపున మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు.Chiranjeevi Endorses -Jagan and Embarrasses Own Brothers

ఈ కీల‌క భేటీలో ప్ర‌స్తుతం ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమస్యలపై చర్చలు జరిపేందుకు .. ఈ రంగంపై ఆధార‌ప‌డి జీవిస్తున్న కార్మికుల బ‌తుకు తెరువు స‌హా.. పంపిణీ వ‌ర్గాల వేతనాల గురించి మాట్లాడే అవ‌కాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులకు సీఎం జగన్ ఆహ్వానం పలికినట్లు సమాచారం. వచ్చే వారంలో ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇంత‌కుముందు సీఎంతో భేటీ లో చిరంజీవి- నాగార్జున – రాజ‌మౌళి- సురేష్ బాబు బృందం స‌మ‌స్య‌లు విన్న‌వించగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే , అలాగే గతంలో పరిశ్రమ కు అనుకూలంగా సీఎం జగన్ ఎప్పుడు వరాలు ఇచ్చినా , చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన సందర్భాలున్నాయి ..అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈసారి స‌మ‌స్య‌కు త‌క్ష‌ణ పరిష్కారం చూపిస్తార‌నే సినీ వ‌ర్గాలు ఆకాంక్షిస్తున్నారు.

Related posts