ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ ఎన్నికల్లో భాగంగా 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఆరో దశలో 676 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో 66 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.
ఉత్తరప్రదేశ్లో ప్రజాస్వామ్య పండుగ నేడు ఆరవ దశకు చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఓటర్లందరూ తప్పకుండా ఈ ఉత్సవంలో పాల్గొనాలని ప్రధాని మోదీ కోరారు.
ఓటర్లందరూ తప్పకుండా ఈ ఉత్సవాల్లో తమ ఓట్లతో పాల్గొనవలసిందిగా నా వినయపూర్వకమైన విన్నపం. మీ ఒక్క ఓటు, ప్రజాస్వామ్య బలం అని మోదీ అన్నారు.
చంద్రబాబుకు పవన్ పార్ట్నర్: వైఎస్ జగన్