సూపర్ స్టార్ మహేష్ బాబుకు హైదరాబాద్లో “ఏఎంబీ మాల్” పేరుతో థియేటర్ ఉన్న సంగతి తెలిసిందే. జంట నగరాల్లోని సినీ, రాజకీయ ప్రముఖులు సినిమాలు చూసేందుకు `ఏఎంబీ మాల్`కే వస్తుంటారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ ఇటీవలె థియేటర్లలోనికి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 300 కోట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రం 400 కోట్ల కలెక్షన్లను సాధించింది. డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికి భారీ వసూళ్ళు సాధించడం చిత్ర బృందానికి సంతోషాన్నిచ్చింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద జెట్ స్పీడ్లో పరుగులు తీస్తోంది. ఈ సినిమాను వీక్షించేందుకు ప్రభాస్ ఈరోజు (సోమవారం) ఏఎంబీ మాల్కు విచ్చేశాడు. ప్రభాస్కు ఏఎంబీ మాల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ప్రభాస్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
Young Rebel Star #Prabhas, Producer #Pramod watched #Saaho @ #AMBCinemas #SaahoInCinemas pic.twitter.com/QVTn3ZIPVk
— BARaju (@baraju_SuperHit) September 9, 2019