పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులంతా చూస్తుండగానే ఓ యువకుడు రాజధాని రైలుకు ఎదురుగా నిలబడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.రైలు వస్తుందని అక్కడ ఉన్న ప్రయాణికులు వారిస్తున్నా వినకుండా.. అందరు చూస్తుండగా ఈ ఘటనకు పాల్పడ్డాడు.. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు
వివర్లాలోకి వెళితే..
ఒడిశాలోని కైరాకు చెందిన సంజయ్ కుమార్ (27) అనే యువకుడు వలస కూలి అని.. తన తాతతో కలిసి హైదరాబాద్లోని ఓ హార్డ్వేర్ దుకాణంలో పనిచేస్తున్నాడు.
గత మూడేళ్లుగా మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్న సంజయ్కు కుటుంబ సభ్యులు వైద్యం చేయిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నుంచి రైలులో రామగుండం రైల్వేస్టేషన్కు చేరుకున్న వలస కూలీ సంజయ్ కుమార్.. అందరూ చూస్తుండగా ఒక్కసారి ట్రాక్ మీదకు దూకి ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలుకు ఎదురుగా నిలబడ్డాడు. దీంతో రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.