telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఇద్దరికీ మించి కనకుండా చట్టం రూపొందించాలి: రామ్‌దేవ్‌ బాబా

Baba Ramdev Sensational comments

యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా జనాభా నియంత్రణ కోసం కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా అరికట్టడానికి కి భారత్‌ పలు కఠిన చర్యలు తీసుకోవాలని రామ్‌దేవ్‌ బాబా పలు సూచనలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…భారత జనాభా మరో 50 ఏళ్ల పాటు 150 కోట్లకు మించకూడదని అన్నారు. అంతకు మించి జనాభాకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి మనం సిద్ధంగా లేమని పేర్కొన్నారు.

దంపతులు ఇద్దరు పిల్లలకు మించి కనకుండా ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలన్నారు. ఒక వేళ వారు మూడో బిడ్డను కంటే, ఆ బిడ్డను ఓటు హక్కుకు దూరం చేసేలా చట్టం రూపొందించాలని తెలిపారు. ముగ్గురు బిడ్డలున్నవారు ఎన్నికల్లో పోటీ కీ అనర్హులుగా ప్రకటించాలని చెప్పారు. వాళ్ళు ఎటువంటి ప్రభుత్వ పథకాలు పొందకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Related posts