telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

మదనపల్లె సీటు కోసం .. వైసీపీ నేత తిప్పారెడ్డి టీడీపీలోకి.. !

ycp tippareddy into tdp

ఏపీలోని ప్రధాన పార్టీల మధ్య ఇంకా పిటాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, వైసీపీ మదనపల్లె ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న తిప్పారెడ్డి.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో మదనపల్లె టికెట్ ను తిప్పారెడ్డికి ఇచ్చేందుకు వైసీపీ నిరాకరించింది.

చంద్రబాబుతో సమావేశమైన తిప్పారెడ్డి.. మదనపల్లె సీటును కోరుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో తిప్పారెడ్డికి చంద్రబాబు ఎలాంటి హామీ ఇచ్చారన్న విషయమై ఇంకా స్పష్టత లేదు. ఇటీవల టీడీపీ 126 అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు ఉండగా, కేవలం 8 సీట్లకు మాత్రమే చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడంలో ఆంతర్యం ఇదే కావచ్చు.!

Related posts