telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ఒంగోలులో వైసీపీ-టీడీపీ ఘర్షణ..కమ్మపాలెంలో ఉద్రిక్తత!

voilance jummalamadugu ycp tdp

ప్రకాశం జిల్లా ఒంగోలు కమ్మపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని కమ్మపాలెం ప్రాంతంలో ఫ్లెక్సీల ఏర్పాటు విషయమై వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకుని దాడికి దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ప్రచారాన్ని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ప్రచారానికి వస్తున్న వైసీపీ కార్యకర్తల్ని అడ్డుకున్నారు.

వైసీపీ నేత బాలినేని శ్రీనివాసులురెడ్డి ప్రచారానికి వెళ్లొద్దని పోలీసుల సూచించారు. కమ్మపాలెంలో వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవాన్ని టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ, వైసీపీ నేతలు ఒంగోలు టూటౌన్ పీఎస్‌ ఎదుట బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Related posts