సంక్షేమ పథకాలపై బురదజల్లడంతో పాటు ఉనికిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మాజీ సీఎం చంద్రబాబు చౌకబారు విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. వరద నష్టం అంచనా కోసం డ్రోన్ కెమెరాలను ఉపయోగించారని చెప్పారు. అసలు డ్రోన్ కెమెరాలంటే చంద్రబాబుకు ఎందుకు భయమని రోజా ప్రశ్నించారు. వరద కారణంగా జరుగుతున్న నష్టం, ముంపు ప్రాంతాలను గుర్తించేందుకు జలవనరుల శాఖ డ్రోన్ ను వాడితే, తన ప్రాణాలు తీయడానికి వాడినట్లు చంద్రబాబు రాద్ధాతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంతోపాటు ఎగువరాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు కృష్ణానది, గోదావరి నిండి చెరువులు, నదులు కళకళలాడటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఐదేళ్లలో నాలుగుసార్లు తుఫాన్లు,వర్షాలు పడి పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ చేస్తున్న డ్రామాలు చూసి ప్రజలు ఛీకొడుతున్నారన్నారు.అసలు అక్రమ కట్టడంపై ఉండటానికి చంద్రబాబుకు సిగ్గు ఉండాలని ఆమె దుయ్యబట్టారు.