నగరి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా తన పేరిట రూ.7.38 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో తెలిపారు. ఇందులో స్థిరాస్తులు రూ.4,64,20,669 కాగా, చరాస్తుల విలువ రూ.రూ. 2,74,17,761గా ఉందని వెల్లడించారు. అలాగే తన పేరుపై రూ.49,85,026 అప్పు ఉందని పేర్కొన్నారు.నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున రోజా మరోసారి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా ఈ నెల 22న రోజా నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా అఫిడవిట్ లోని వివరాలు బహిర్గతమైనాయి. కుమార్తె అనూష, కుమారుడు కృష్ణ కౌశిక్ పేరిట రూ.50 లక్షల డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్ లో రోజా తెలిపారు. అలాగే తన దగ్గర కోటి రూపాయలు విలువ చేసే మహీంద్రా, ఫోర్డ్ ఇండీవర్, చావర్లెట్, ఇన్నోవా క్రిష్టా, ఫార్చ్యునర్, హూండా స్ల్పెండర్, మహీంద్రా స్కార్పియో కార్లు ఉన్నాయని తెలిపారు.
చీరలకు సిరిసిల్ల బ్రాండ్ అంబాసిడర్ కావాలి: కేటీఆర్