telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నాకు ప్రాణాహాని ఉందని వైసీపీ ఎంపీ లోక్‌సభ స్పీకర్‌ కు లేఖ!

raghurama krishanam raju

తమకు ప్రాణాహాని ఉందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభ స్పీకర్‌కు మొరపెట్టుకున్నారు. తనను చంపుతామని కొందరు వ్యక్తులు బెరిరిస్తున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఆయన లేఖ రాశారు. కేంద్రబలగాలతో తనకు రక్షణ కల్పించాలంటూ లేఖలో విజ్ఞప్తి చేశారు. తనను చంపేస్తామని బెదిరించిన వారిపై ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదంటూ లేఖలో స్పీకర్‌కు రఘురామకృష్ణంరాజు వివరించారు.

స్పీకర్‌కు రాసిన లేఖనే హోంమంత్రికి కూడా పంపినట్లు సమాచారం. అంతకముందు రఘురామకృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి కూడా లేఖ రాశారు. నాలుగు పోలీస్ స్టేషన్ల అధికారులపై ఎస్పీకి రఘురామకృష్ణంరాజు, పీఎస్‌ వర్మ ఫిర్యాదు చేశారు. నలుగురు ఎస్సైలపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీని కోరారు.

Related posts