*వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసు
*పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు
*రాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు
*కేసునుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్సీ విఫలయత్నం..
*కాకినాడ ఏఆర్ హెడ్క్వార్టర్స్లో ఎమ్మెల్సీ అనంతబాబు
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ డ్రైవర్ హత్య కేసులో అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆదివారం రాత్రి ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాకినాడలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు ఉంచినట్లు తెలుస్తోంది.
కాగా..వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబే మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంది ముమ్మాటికీ హత్యేనని పోస్టుమార్టంలో నివ్వెరపరిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.విపరీతంగా కొట్టడంతో శరీరంలోని కొన్ని అంతర్గత అవయవాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యుల గుర్తించారు.
ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ను అరెస్టు చేస్తామని, హత్య కేసు నమోదు చేస్తామని పోలీసులు ప్రకటించడంతో శనివారం అర్ధరాత్రి కుటుంబసభ్యులు శవపంచనామాకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 9.30 గంటలకు కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు