telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్యే రోజా గన్‌ మెన్‌ కు కరోనా.. అధికారుల అప్రమత్తం

roja ycp mla

ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 23 వేలను దాటింది. పలువురు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కరోనా బారినపడ్డారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గన్ మెన్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

దీంతో ఒక్కసారిగా చిత్తూరు జిల్లాలో కలకలం రేగింది. రోజాతో కలిసి ఇన్ని రోజులు ఆయన ట్రావెల్ చేశారు. గన్ మెన్ కు కరోనా సోకడంతో రోజా తన ఇంట్లోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనతో అధికారులు అలర్ట్ అయ్యారు. గన్ మెన్ కు కాంటాక్ట్ లో ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు.

Related posts