telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

సైకిల్‌ గుర్తుకే మీ ఓటు అని ప్రచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే…

ప్రస్తుతం ఏపీలో వరుస ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అక్కడ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో.. కొన్ని ప్రాంతాల్లో వెనక్కి తగ్గిన ఆ పార్టీ అభ్యర్థులు.. మరికొన్ని ప్రాంతాల్లో అయితే.. పార్టీ అధినేత ఆదేశాలను సైతం పక్కనబెట్టి ప్రచారం చేస్తున్నారు. ఇది ఎలా ఉన్నా.. పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యే… ప్రతిపక్ష పార్టీకి చెందిన సైకిల్ గుర్తుకు ఓటు వేయాలంటూ నోరు జారిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. అసలు ఏం జరిగిందంటే… పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు.. పరిషత్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు.. ఉంగుటూరు మండలం, గోపీనాథపట్నంలో వైసీపీకి చెందిన జెడ్పీటీసీ అభ్యర్థిని కొరిపల్లి జయలక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థిని గంట శ్రీలక్ష్మి తరపున ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు మీ ముందుకు వచ్చారు.. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి వారిని గెలిపించాలంటూ నోరు జారారు.. దీంతో.. షాక్ తిన్న అక్కడున్న అధికార పార్టీ నేతలు నోరు వెల్లబెట్టారు.

Related posts