telugu navyamedia
ఆంధ్ర వార్తలు

గల్లంతైన మత్స్యకారుల కుటుంబాల‌కు పేర్నినాని ఓదార్పు

కృష్ణా జిల్లాకు చెందిన‌ మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. శనివారం వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు.

కాకినాడ సమీపంలో బోటు మోటారు పాడైందని, అంతర్వేది సమీపంలో ఉన్నామని కుటుంబ సభ్యులకు మత్స్యకారులు సమాచారం తెలిపారు. ఆ తర్వాత నుంచి ఫోన్లు పని చేయడం లేదు. మత్స్యకారుల ఆచూకీ కోసం పోలీసులు, రెస్క్యూటీమ్ సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టాయి.

అయితే మత్స్యకారుల కోసంవారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీంతో మచిలీపట్నం మండలం క్యాంబెల్ పేటలో ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు పేర్నినాని ఓదార్చారు. వారు తప్పకుండా తిరిగి వస్తారంటూ ధైర్యం చెప్పారు.

గల్లంతైన వారి కోసం ముమ్మరంగా సహాయకచర్యలు చేపడుతున్నాం ధైర్యంగా ఉండాలని పేర్ని నాని ధైర్యం చెప్పారు. మత్స్యకారులతో ఫోన్ కాంటాక్ట్ లేకపోవడంతో స్థానిక మత్యకారులు బోట్ లో వేతకటానికి అంతర్వేది వెళ్లారని, అయినా దొరకకపోవడంతో తనకు నాకు మెస్సేజ్ ఇచ్చారని నాని తెలిపారు.

దీంతో సోమవారం సాయంత్రం నుండి హెలికాప్టర్ సెర్చ్ చేస్తుందని, అంతర్వేది, చెన్నై, కాకినాడ తదితర ప్రాంతాల వైపు గాలింపు కొనసాగుతుందని క్షేమంగా బయటకు వస్తారనే నమ్మకం ఉందన్నారు

Related posts